Mobile:  +91 +91 8297164711 E-Mail: admin@metiamaraavathi.com, info@metiamaraavathi.com Website:  http://www.metiamaraavathi.com
Login | E-Paper
విజయవాడ:సంక్రాంతి అందరి జీవితాలలో వెలుగులు నింపాలి..భోగి వేడుకల్లో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి.....చిట్టినగర్ లో హనుమత్ దీక్షా పీఠం లో ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రత్యేక పూజలు...//రంపచోడవరం : అక్రమ మైనింగ్ లపై, అక్రమ కట్టడాలపై ఫిర్యాదు చేస్తున్న వారిపై జరుగుతున్న బెదిరింపులు దాడులు ఖండిస్తూ...ఆదివాసి సంక్షేమ పరిషత్ (274/16) ఐటీడీఏ ఎదుట ధర్నా.../ అమరావతి : కోడి పందేలను అడ్డుకోండి: హైకోర్టు ఆదేశం...సంక్రాంతి పండగకు కోడి పందేలు నిర్వహిస్తే జంతుహింస నిరోధక చట్టం 1960, ఎపి జూద నిరోధక చట్టం-1974 కింద చర్యలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించిన ఎపి హైకోర్టు..../విజయవాడ :ఘనంగా నటభూషణ శోభన్ బాబు 90వ జన్మదిన వేడుకలు...//12 నుంచి 15 వరకు స్వగ్రామంలో పండుగ జరుపుకోనున్న సిఎం చంద్రబాబు నాయుడు.../ /కొండపల్లి: తెలుగు వారి సంస్కృతీ, సాంప్రదాయానికి ప్రతీక కొండపల్లి బొమ్మలు..ప్రపంచానికి తెలుగువారిచ్చిన విలువైన బహుమతి కొండపల్లి బొమ్మలు...యూరోపియన్ అంబాసిడర్ హెర్వే డెల్ఫిన్...//తిరువూరు : ఎంపీ కేశినేని శివనాథ్ ను క‌లిసిన తిరువూరు పట్ట‌ణ నాయ‌కులు... 2026 క్యాలెండ‌ర్ ఆవిష్క‌రించిన ఎంపీ కేశినేని శివ‌నాథ్ ...//విజయవాడ : సమాచార శాఖ కార్యాలయంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు.../ /జగ్గయ్యపేట : గోకులం షెడ్డులను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)..//జగ్గయ్యపేటలో భారీ నిరసన... జగ్గయ్య పేటలో పెరుగుతున్న కాలుష్యానికి వ్యతిరేకంగా మరియు ప్రజల ఆరోగ్య రక్షణ కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం..../ /విజయవాడ : గొల్లపూడిలో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు...తెలుగు ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపిన..సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి../ /విజయవాడ:ఇబ్రహీంపట్నంలో ఘనంగా రేనాటి వీరుడు వడ్డే ఓబన్న జయంతి...//తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో సంక్రాంతి వేడుక...పెనుగంచిప్రోలు../ /పోలవరం :నల్లరాయి క్వారీ ముసుగులో ఎర్ర మట్టి రవాణా!...అడ్డుకున్న ఓజుబంద ఆదివాసి ప్రజలు... మైనింగ్ మాఫియా తో మైనింగ్ అధికారులు మిలాఖత్... ఫిర్యాదులకు తప్పుడు నివేదికలు,.. ఆదివాసి సంక్షేమ పరిషత్ మండిపాటు.../ /జగ్గయ్యపేట : ఉద్యోగుల డి ఏ సంక్రాంతి కానుక ఒకరికి తీపి మరొకరికి చేదు...శెట్టిపోగు రాము..//చింతూరు: సూరకుంట గ్రామంలో ఘనంగా మావ నాటే - మావ సంస్కృతి క్రీడా ఉత్సవం.../ /రాజవొమ్మంగి : లబ్బర్తిలో ముగ్గులపోటీలు తిలకించిన ఎమ్మెల్యే శిరీషాదేవి...//కార్యకర్తలకు భరోసాగా ఉంటాను..తెదేపా కార్యకర్తలను పరామర్శించిన ఎమ్మెల్యే శిరీషాదేవి..../ /రాజవొమ్మంగి :ఘనంగా నెల్లిమెట్ల గ్రామం లో సంక్రాతి సంబరాలు..///గ్రామపంచాయతీ నిధులు దుర్వినియోగం పై జరిపిన విచారణ, తీసుకున్న చర్యలు పై శ్వేత పత్రం విడుదల చేయండి...ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను డిమాండ్./ /పరిశోధనాత్మక జర్నలిజంతో నిజాలను నిర్భయంగా ప్రచురించే దినపత్రిక//ప్రజా సమస్యల పరిష్కారంలో, ప్రజాక్షేత్రంలో, ప్రజల కోసం పాటుపడే దినపత్రిక

ఎడిటర్ కాలమ్...

Editor Image

ఏజెన్సీలో దారుణాలు.. ఉద్యమాలు చేశారని కుటుంబ బహిష్కరణ..!....

దిరిసినపల్లి గ్రామానికి చెందిన బల్లెం గంగాభవాని కుటుంబం బహిష్కరణ ఘటనలో ఎన్. సి ఎస్. టి. నుండి జిల్లా కలెక్టర్ కు నోటీసులు..!....

    
న్యాయం జరుగుతుందని ఆశిస్తున్న బాదితులు...!
..
చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం....
రంపచోడవరం..
నర్సాపురం, దిరిసిన పల్లి గ్రామాల పరిధిలో గల నల్ల రాయి క్వారీల వలన తమ ఇల్లు పాడైపోతున్నాయని , విచ్చలవిడిగా బ్లాస్టింగ్ జరగటం వలన దుమ్ము దూళి, పంట పొలాలు నాశనం అవ్వటం, భూమి అదరటం వలన ఇల్లు టీవీలు పాడవటం జరుగుతున్నాయని,పర్యావరణ కాలుష్యం వలన ఆరోగ్యం పాడవుతున్నాయని దిరిసిన పల్లి గ్రామానికి చెందిన బల్లెం గంగాభవాని తో పాటు కొంతమంది బాధితులు కలిసి నవంబర్ 17వ తారీఖున రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వారికి ఫిర్యాదు చేసినందుకు క్వారీ నిర్వహకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్న కొంతమంది దిరసనపల్లి గ్రామ పెద్దలు బాధిత ఫిర్యాదు దారులను బెదిరించి భయపెట్టి తెల్ల పేపర్ల మీద సంతకం చేసి బాధితులు మాట్లాడకుండా చేశారు. అయితే బల్లెం గంగా భవాని కుటుంబం మాత్రం తమ సమస్యలపై పరిష్కారం లభించే వరకు పోరాటం చేస్తామని ధైర్యంగా నిలబడి ఇప్పటికి పోరాటం చేస్తూనే ఉన్నారు. గతంలో ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని బెదిరించిన కొంతమంది గ్రామ పెద్దలు , 20వేల రూపాయలు జరిమానా కట్టాలని గంగా భవాని కుటుంబాన్ని బెదిరించడం మానసికంగా హింసిస్తూ దాడులకు తెగబడ్డరు , అలాగే నవంబర్ 19వ తేదీ నాడు గ్రామం నుండి వెలివేస్తున్నట్లు గ్రామ పెద్దలు ప్రకటించడం జరిగింది, దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో, ఐటిడిఎ లో, జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ లో జిల్లా ఎస్పీ గారికి, పలుమార్లు ఫిర్యాదు చేసిన ఉపయోగం లేదు. దీనిపై బాధితురాలు జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ న్యూ డిల్లీ కు ఫిర్యాదు చేయటంతో స్పందించిన కమిషన్ సంఘటనపై 30 రోజుల్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నోటీసులు పోస్ట్ ద్వారా అందుకున్న బల్లెం గంగాభవాని కుటుంబం ఇప్పటికైనా తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. స్థానిక పోలీస్, ఐటీడీఏ, జిల్లా కలెక్టర్ , మరియు మైనింగ్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం కారణంగానే తమకు అన్యాయం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తపరిచారు. విచారణ పేరుతో వచ్చిన రంపచోడవరం ఎమ్మార్వో, మైనింగ్ ఏడి పాడేరు వారు నవంబర్ 24వ తేదీన తమ కుటుంబంపై తమకు అండగా నిలిచిన ఆదివాసి నాయకులపై ప్రజలను రెచ్చగొట్టి దాడి చేయించారని, ఈ విషయంపై కూడా జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ కు ఫిర్యాదు చేసి ఉన్నామని వారు ఈ సందర్భంగా తెలియజేశారు..
(పోలవరం జిల్లా ప్రతినిధి గ్రౌండ్ రిపోర్ట్)
మరో కథనంతో మళ్లీ కలుద్దాం...
--లోవరాజు...
మేటి అమ‌రావ‌తి పోలవరం జిల్లా ఇంచార్జి.... Let’s join with us…

Metiamaraavathi TeluguNews paper

Head Office
H.No: 35-208, Mpp school Road, Sramik Nagar,
Konadapally,
NTR District AndhraPradesh,
Vijayawada - 521456

Editor & Printer
Vemula AnandaRao,Kondapally
Vijayawada - 521456

Registration
APTEL/25/A3429
Phone: 9059167346

Email ID :info@metiamaraavathi.com
Email ID :admin@metiamaraavathi.com
WebSite :http://www.metiamaraavathi.com
20+ Years Journey :

Contact Form