Mobile:  +91 +91 8297164711 E-Mail: admin@metiamaraavathi.com, info@metiamaraavathi.com Website:  http://www.metiamaraavathi.com
Login | E-Paper
హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తారా...? తుంగలో తొక్కుతారా...? ఇబ్రహీంపట్నం మండల పరిదిలో కోడి పందేల నిర్వహణ కోసం బిరులు సిద్దం...//రంపచోడవరం : అక్రమ మైనింగ్ లపై, అక్రమ కట్టడాలపై ఫిర్యాదు చేస్తున్న వారిపై జరుగుతున్న బెదిరింపులు దాడులు ఖండిస్తూ...ఆదివాసి సంక్షేమ పరిషత్ (274/16) ఐటీడీఏ ఎదుట ధర్నా.../ కోడి పందేలను అడ్డుకోండి: హైకోర్టు ఆదేశం...సంక్రాంతి పండగకు కోడి పందేలు నిర్వహిస్తే జంతుహింస నిరోధక చట్టం 1960, ఎపి జూద నిరోధక చట్టం-1974 కింద చర్యలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించిన ఎపి హైకోర్టు..../చిత్తూరు : నారావారిపల్లెకు సీఎం చంద్రబాబు...//12 నుంచి 15 వరకు స్వగ్రామంలో పండుగ జరుపుకోనున్న సిఎం చంద్రబాబు నాయుడు.../ /కొండపల్లి: తెలుగు వారి సంస్కృతీ, సాంప్రదాయానికి ప్రతీక కొండపల్లి బొమ్మలు..ప్రపంచానికి తెలుగువారిచ్చిన విలువైన బహుమతి కొండపల్లి బొమ్మలు...యూరోపియన్ అంబాసిడర్ హెర్వే డెల్ఫిన్...//విజయవాడ : ముగిసిన ‘ఖాదీ మహోత్సవం’ 10 రోజుల్లో రికార్డు స్థాయి అమ్మకాలు.దాదాపు రూ. 2 కోట్ల 20 లక్షలకు పైగా అమ్మకాలు....//విజయవాడ : సమాచార శాఖ కార్యాలయంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు.../ /హైదరాబాద్ : స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ పేరిట రిటైర్డ్ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ భార్య నుంచి రూ.2.58 కోట్లు కాజేసిన మోసగాళ్లు../ /విజయవాడ : ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాలలో ఈ నెల 12న ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణ... జిల్లాల కలెక్టర్లు లక్ష్మీశ, బాలాజీ వెల్లడి.../ /విజయవాడ:ఇబ్రహీంపట్నంలో ఘనంగా రేనాటి వీరుడు వడ్డే ఓబన్న జయంతి...//నేష‌న‌ల్ బ్యాడ్మింట‌న్ విన్న‌ర్ సూర్య చ‌రిష్మాను అభినందించిన ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని)../ /పోలవరం :నల్లరాయి క్వారీ ముసుగులో ఎర్ర మట్టి రవాణా!...అడ్డుకున్న ఓజుబంద ఆదివాసి ప్రజలు... మైనింగ్ మాఫియా తో మైనింగ్ అధికారులు మిలాఖత్... ఫిర్యాదులకు తప్పుడు నివేదికలు,.. ఆదివాసి సంక్షేమ పరిషత్ మండిపాటు.../ /జగ్గయ్యపేట : మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను../ /రంపచోడవరం : ఎస్టీ కమిషన్ చైర్మన్ సోల్ల బొజ్జి రెడ్డి చేతుల మీదుగా ఎ. టి. ఎ. క్యాలెండర్ ఆవిష్కరణ..../ /పోలవరం :ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డికి ఏపీ కాబినెట్ స్థానం...///గ్రామపంచాయతీ నిధులు దుర్వినియోగం పై జరిపిన విచారణ, తీసుకున్న చర్యలు పై శ్వేత పత్రం విడుదల చేయండి...ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను డిమాండ్./ /పరిశోధనాత్మక జర్నలిజంతో నిజాలను నిర్భయంగా ప్రచురించే దినపత్రిక//ప్రజా సమస్యల పరిష్కారంలో, ప్రజాక్షేత్రంలో, ప్రజల కోసం పాటుపడే దినపత్రిక

ఎడిటర్ కాలం...

Editor Image

నల్లరాయి క్వారీ ముసుగులో.... ఎర్ర మట్టి రవాణా!....

అడ్డుకున్న ఓజుబంద ఆదివాసి ప్రజలు!....

    
మైనింగ్ మాఫియా తో మైనింగ్ అధికారుల మిలాఖత్.!
..
ఆదివాసి సంక్షేమ పరిషత్ మండిపాటు.
ఫిర్యాదులకు తప్పుడు నివేదికలు..
పోలవరం జిల్లా గంగవరం మండలం ఒజుబంద గ్రామంలో గల నల్లరాయి క్వారీల ముసుగులో గ్రామాల మట్టి అక్రమ రవాణా జరుగుతుంది. ఇది తెలుసుకున్న ప్రజలు అక్రమంగా తరలిస్తున్న గ్రావెల్ లోడ్ లారీలను అడ్డుకొని నిరసన తెలియజేయడం జరిగింది. ఇప్పటికే నల్లరాయి క్వారీల తోటి అనేక ఇబ్బందులు పడుతున్నామని, రోడ్లు పాడవుతున్నాయి, పంట పొలాలు నాశనం అవుతున్నాయి, ఇల్లు బీటలు వారుతున్నాయి, ఆరోగ్యాలు పాడవుతున్నాయి, అడవి అంతరించిపోతుంది వీటన్నిటిపై పిఓకి కలెక్టర్ కి మైనింగ్ డిపార్ట్మెంట్ వారికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోగా మైనింగ్ డిపార్ట్మెంట్ వారు క్వారీ నిర్వాహకులకు కొమ్ము కాస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తపరిచారు. తక్షణమే అధికారులు స్పందించి క్వారీలను మూసివేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను ప్రకటన ద్వారా మాట్లాడుతూ. ఓజబందులో గల నల్లరాయి క్వారీల పై ప్రజలు ఆదివాసి సంక్షేమ పరిషత్ ఉన్నత స్థాయి అధికారులు కూడా ఫిర్యాదు చేసి ఉన్నామని, అయితే దీనిపై మైనింగ్ ఏడికి క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండా ప్రజలతో మాట్లాడకుండా తానొక్కరే టూరిస్ట్ లాగ వచ్చి క్వారీ దగ్గర ఫోటో తీసుకుని సైలెన్స్ గా వెళ్లిపోయారని ఆయన మండిపడ్డారు. ఆ ఫోటో పెట్టి స్థానికంగా అంత బాగానే ఉంది ఎటువంటి ఇబ్బంది లేదంటూ, ఉన్నత అధికారులకు తప్పుడు నివేదికలు అందజేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మైనింగ్ ఏడి వలన ఏజెన్సీ లో మైనింగ్ మాఫియా రెచ్చిపోతుందని అతనిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రంప ఏజెన్సీ ప్రాంతంలో విచ్చలవిడిగా మైనింగ్ మాఫియా రెచ్చిపోవడానికి కారణం, మైనింగ్ ఏడి అస్తమేనని ఆయన ఆరోపించారు. రంపచోడవరం మండలం నరసాపురం లో గల నల్లరాయి క్వారీల పై కూడా ఇలాగే తప్పుడు నివేదికలు ఇస్తూ మైనింగ్ మాఫియాని పెంచి పోషిస్తూ నష్టపోతున్న రెండు గ్రామాల ప్రజలకు అన్యాయం చేస్తూ వస్తున్నారని ఆయన ఈ సందర్భంగా విమర్శించారు. వీటన్నిటి పై పలుమార్లు కలెక్టర్ ఐటిడిఏ గ్రీవెన్స్ లలో ఫిర్యాదు చేస్తున్నప్పటికీ పాత చింతకాయ పచ్చడి లాగానే ఇచ్చిన రిపోర్ట్ ని తిరిగి ఇస్తూ కాలం గడిపేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రంప నియోజకవర్గంలో నడుస్తున్న అక్రమ మైనింగ్ పై ఉక్కుపాదం మోపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల కు అండగా అక్రమ మైనింగ్ మూసివేసే వరకు ఆదివాసి సంక్షేమ పరిషత్ ఉద్యమాన్ని కొనసాగిస్తుందని, తప్పుడు కేసులు పెట్టిస్తూ, ఫిర్యాదుదారులను బెదిరింపులకు గురిచేస్తు దాడులు చేస్తున్నటువంటి మైనింగ్ మాఫియాకు, మైనింగ్ డిపార్ట్మెంట్ అధికారులకు, దీని వెనక ఉన్న రాజకీయ నాయకుల కు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని ఆయన హెచ్చరించారు. ఈ విషయంపై సోమవారం నాడు ఐటిడిఏ ముట్టడిసేపడతామని ఆయన తెలియజేశారు.
(పోలవరం జిల్లా ప్రతినిధి గ్రౌండ్ రిపోర్ట్)
మరో కథనంతో మళ్లీ కలుద్దాం...
--లోవరాజు...
మేటి అమ‌రావ‌తి పోలవరం జిల్లా ఇంచార్జి.... Let’s join with us…

Metiamaraavathi TeluguNews paper

Head Office
H.No: 35-208, Mpp school Road, Sramik Nagar,
Konadapally,
NTR District AndhraPradesh,
Vijayawada - 521456

Editor & Printer
Vemula AnandaRao,Kondapally
Vijayawada - 521456

Registration
APTEL/25/A3429
Phone: 9059167346

Email ID :info@metiamaraavathi.com
Email ID :admin@metiamaraavathi.com
WebSite :http://www.metiamaraavathi.com
20+ Years Journey :

Contact Form